గుంతకల్లు పట్టణం, గుంతకల్లు, : పాత ఇంటిని కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తుండగా.. దాని గోడ కూలి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని బలిగొన్న విషాద ఘటన ఇది. అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం జరిగిన ఈ ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుల కథనం.. మున్సిపల్ కూరగాయల మార్కెట్ వెనుక రమేశ్ అనే వ్యక్తి ఓ పాత ఇంటిని కొనుగోలు చేశారు. రెండు రోజులుగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఏకలవ్యనగర్లో కిరాణా దుకాణం నడిపే వెంకటరాముడు (57) సరకుల నిమిత్తం శనివారం బైక్పై మార్కెట్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వస్తుండగా పనులు జరుగుతున్న ఇంటి వద్దకు రాగానే ఒక్కసారిగా గోడ కుప్పకూలి ఆయనపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వెంకటరాముడు అక్కడికక్కడే మరణించారు భర్త ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో భార్య ఉమాదేవి అక్కడికి చేరుకున్నారు. మట్టి పెల్లల కింద విగతజీవిలా పడి ఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోదించారు. జనసంచారం ఉన్నచోట ఎలాంటి హెచ్చరిక బోర్డులూ లేకుండా పనులు ఎలా చేపడతారని స్థానికులు ప్రశ్నించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Also read
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద