నంద్యాల : జల్సాలకు అలవాటు పడి నంద్యాల జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 42 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పి సునీల్ షెరాన్ తెలిపారు. ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సోహెల్ఖాన్ అలియాస్ జహీర్ఖాన్ జల్సాలకు అలవాటు పడి 2025లో ఆత్మకూర్ పోలీస్ స్టేషన్, నంద్యాల పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి సుమారు రూ.42 లక్షలు విలువైన 42 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. వచ్చిన సొమ్మును వెలుగోడు దగ్గర ఎస్ఆర్బిసి కెనాల్ వద్ద దాచిపెట్టాడు. నిందితుడిపై గతంలో కుప్పం, పెనుగొండ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులున్నాయని, ఈ కేసులలో జైలుకు కూడా పోయి వచ్చాడని ఎస్పి చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్టాప్గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





