తెలంగాణ ప్రభుత్వం టీఎస్ కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు ఖర్చవుతాయని సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ నోట్ ను రూపొందించారు. దీనిపై విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దాన్ని సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ నోట్ ను ప్రచారం కావడంపై ప్రభుత్వం సీరియస్ కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!