February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

నెల్లూరు  ఆస్తి కోసం చిత్రహింసలలు పోలీసులకు వృద్ధురాలి ఫిర్యాదు

నెల్లూరు: ‘ఆస్తి కోసం నా చిన్న కుమారుడు చిత్రహింసలుపెడుతున్నాడు. నేను చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తి కాజేయాలని యత్నిస్తున్నాడు. విచారించి చర్యలు చేపట్టాలి’ అని పొదలకూరుకు చెందిన ఓ వృద్ధురాలు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 71 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డిలు త్వరితగతిన పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు.

తన తల్లి ఆత్మహత్య ఘటనలో లోతుగా విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నవాబుపేటకు చెందిన ఓ వ్యక్తి కోరారు.

→ అత్తింటి వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని ఏఎస్పేటకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

Also read

Related posts

Share via