నెల్లూరు: ‘ఆస్తి కోసం నా చిన్న కుమారుడు చిత్రహింసలుపెడుతున్నాడు. నేను చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తి కాజేయాలని యత్నిస్తున్నాడు. విచారించి చర్యలు చేపట్టాలి’ అని పొదలకూరుకు చెందిన ఓ వృద్ధురాలు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 71 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డిలు త్వరితగతిన పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు.
తన తల్లి ఆత్మహత్య ఘటనలో లోతుగా విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నవాబుపేటకు చెందిన ఓ వ్యక్తి కోరారు.
→ అత్తింటి వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని ఏఎస్పేటకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
Also read
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత