తల్లిదండ్రులు విడిగా ఉండడం తట్టుకోలేని ఓ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
నల్గొండ : తల్లిదండ్రులు విడిగా ఉండడం తట్టుకోలేని ఓ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. నల్గొండ టూటౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు.. కుటుంబ తగాదాల కారణంగా తిప్పర్తి మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన పగిళ్ల సైదులు, అతడి భార్య సంధ్య గత రెండేళ్లుగా నల్గొండలోని సావర్కర్నగర్లో వేరువేరుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమార్తె యోగిత (22), కుమారుడు చాణక్య(20) సంతానం. యోగిత ప్రస్తుతం హైదరాబాద్లో పీజీ చదువుతోంది. ఇద్దరూ తల్లి పోషణలో ఉన్నారు. కొద్ది రోజులుగా తల్లిదండ్రులను కలపడానికి యోగిత పలు ప్రయత్నాలు చేసింది. కానీ.. వారు కలిసే పరిస్థితి లేదని మనోవేదన చెందిన ఆమె గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Also read
- Andhra: స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్ రూమ్లో ఏం జరిగింది..?
- నేటి జాతకములు….12 నవంబర్, 2025
- Nandi in Shiva temple: శివాలయాల్లో
నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి? - శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
- Pune Crime: ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు





