పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు.

బల్లార్ష, : పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు. కొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరాల్సిన నలుగురిని విద్యుత్ తీగలు మృత్యుపాశాలై కబళించాయి. మహారాష్ట్రలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చంద్రపుర్ జిల్లా బ్రహ్మపురి తాలూకా గణేశ్పుర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ రవూత్(65), యువరాజ్ డొంగరే(43), నానాజీ రవూత్(55), చిచ్కీడా గ్రామానికి చెందిన పుండలీక్ మాన్కర్(65) కూలి పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుధవారం ఉదయం గణేశ పుర్ శివారులోని ఓ రైతు పొలంలో వరినాట్లు వేసిన ఆ కూలీలు పనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. పొలం మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు లైన్ తీగలు అదే సమయంలో ప్రమాదవశాత్తు తెగి కిందపడిపోయాయి. ఆ తీగలు తగలడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





