పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు.

బల్లార్ష, : పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు. కొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరాల్సిన నలుగురిని విద్యుత్ తీగలు మృత్యుపాశాలై కబళించాయి. మహారాష్ట్రలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చంద్రపుర్ జిల్లా బ్రహ్మపురి తాలూకా గణేశ్పుర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ రవూత్(65), యువరాజ్ డొంగరే(43), నానాజీ రవూత్(55), చిచ్కీడా గ్రామానికి చెందిన పుండలీక్ మాన్కర్(65) కూలి పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుధవారం ఉదయం గణేశ పుర్ శివారులోని ఓ రైతు పొలంలో వరినాట్లు వేసిన ఆ కూలీలు పనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. పొలం మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు లైన్ తీగలు అదే సమయంలో ప్రమాదవశాత్తు తెగి కిందపడిపోయాయి. ఆ తీగలు తగలడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!