విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి వినియోగంపై కొరడా ఝులిపించారు పోలీసులు. మైనర్లను గంజాయి మత్తులోకి దింపి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూలుకు వెళ్ళే మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి గంజాయి మత్తులో దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అమ్మాయిలకు గంజాయి ఎరగా వేసి వారిని లోబర్చుకుంటున్న వారిని అరెస్ట్ చేశారు.
జగిత్యాల టౌన్లోని పద్మానగర్కు చెందిన ప్రేమ్, వెంకటేష్, నితిన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఫోక్సో కేసుతో పాటు ఎన్టీపీసీ యాక్ట్ కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని మైనర్లను మచ్చిక చేసుకుని వారికి గంజాయి అలవాటు చేసి వారిపై అత్యాచారానికి పాల్పుడుతన్నారని పోలీసులు తెలిపారు. ఏడాది కాలంగా గంజాయికి అడిక్ట్ అయిన ఆ యవకులు ముగ్గురు కూడా మైనర్ బాలికలపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.
పేదలే టార్గెట్..?
ఈ రొంపిలోకి దింపేందుకు యువకులు పేద కుటుంబాలకు చెందిన మైనర్లనే ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోందని పోలీసులు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అంతగా లేని కుటుంబాలకు చెందిన వారు అయితే ఈజీగా తమ ట్రాప్ లో పడుతారన్న ఆలోచనతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారన్న పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయికి అడిక్ట్ అయిన చిన్నారులు ఆ మత్తు నుండి బయటపడలేక దాని కోసం వెతకాల్సిన స్థితి చేరిపోయారు. దీనికి అలవాటు పడిన వారంతా కూడా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టారు. గంజాయి దందాపై కూపీ లాగుతున్నారు. జగిత్యాల పట్టణంలో చాపకింద నీరులా సాగుతున్న గంజాయి దందాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో రోజుకో ముఠా గురించి వెలుగులోకి వస్తోంది.
Also read
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి
- 100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాల కటాక్షం!
- పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం, వివాహ యోగం ఖాయం!





