హైదరాబాద్ కూకట్పల్లిలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. వెల్ విజన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రజలను నిండా ముంచింది. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశచూపి రూ.14 కోట్లు వసూలు చేసి చాప చుట్టేసింది. పెట్టిన పెట్టుబడికి ప్రతినెలా ఫ్రిడ్జ్, టీవీలు బోనస్గా ఇస్తామంటూ ఆశ చూపించి బురుడీ కొట్టించింది. కేవలం వడ్డా మాత్రమే కాకుండా పెట్టిన పెట్టుబడికి బహుమతులు కూడా ఇస్తామని ప్రకటనలు గుప్పించింది. రూ.లక్షకు టీవీ, రూ.2 లక్షలకు
హైదరాబాద్ కూకట్పల్లిలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. వెల్ విజన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రజలను నిండా ముంచింది. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశచూపి రూ.14 కోట్లు వసూలు చేసి చాప చుట్టేసింది. పెట్టిన పెట్టుబడికి ప్రతినెలా ఫ్రిడ్జ్, టీవీలు బోనస్గా ఇస్తామంటూ ఆశ చూపించి బురుడీ కొట్టించింది. కేవలం వడ్డా మాత్రమే కాకుండా పెట్టిన పెట్టుబడికి బహుమతులు కూడా ఇస్తామని ప్రకటనలు గుప్పించింది. రూ.లక్షకు టీవీ, రూ.2 లక్షలకు వాషింగ్ మిషన్, రూ.3 లక్షలకు ఫ్రిడ్జ్లు ఇస్తామంటూ ప్రజలను నమ్మించిన వెల్ విజన్ ఇన్ ఫ్రా నిర్వాహకులు రాత్రికి రాత్రే ఉడాయించారు.
అధిక వడ్డీకి, అకర్షణీయమైన బహుమతులకు ఆశపడ్డ ప్రజలు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తీరా తాము మోసపోయామని గ్రహించిన తర్వాత, వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు. ఈ కేసులో భాగంగా పోలీసులు వెల్విజన్ కంపెనీ చైర్మన్ కందుల శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఇతర బాధితులు కూడా ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సుమారు 200 మంది బాధితుల దగ్గరి నుంచి రూ.14 కోట్లు వసూలు చేశారు. 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కాకుండా సావధానంగా ఉండాలని, అధిక వడ్డీ పేరుతో మోసాలు చేసే వారి పై విశ్వాసం పెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా, కూకట్పల్లిలో వెల్విజన్ కంపెనీ మోసం కేసు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రజల డబ్బులను తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..