మద్యానికి బానిసైన తనపై పీఎస్లో ఫిర్యాదు చేసిందనే కోపంతో ఓ వ్యక్తి తను కట్టుకున్న భార్యనే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఖమ్మంలోని గట్టయ్య సెంటర్లో వెలులు చూసింది. భార్య సాయి వాణి (36 )ను భర్త భాస్కర్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసాడు. అడ్డుకోబోయిన కూతురు పై కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు వాణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. గాయపడిన ఆమె కూతురిని హాస్పిటల్లో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన భాస్కర్కు కొన్నేళ్ల క్రితం వాణి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసై.. తరచూ భార్యపై అనుమానంతో వేడిస్తుండేవాడు భాస్కర్. దీంతో భార్య అతనిపై పీఎస్లో ఫిర్యాదు చేయడంతో గతంలో జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో భాస్కర్పై వేధింపులు కేసు కూడా నమోదైంది.
అయినా భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. ఇక వాణి ఖమ్మంలోని ఓ పంక్షన్ హాల్లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తుంది. అయితే వాణిపై కోపం పెంచుకున్న భాస్కర్.. గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి.. వాణిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అయితే తల్లిపై దాడి చేస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన కుమార్తెపై కూడా భాస్కర్ దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు భాస్కర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- మార్గశిర మాసం.. ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేస్తే.. ఇంట్లో కనక వర్షం కురిసినట్టే..
- నేటి జాతకములు…22 నవంబర్, 2025
- అలసిపోయాను.. చావడానికి అనుమతి ఇవ్వండి.. సుప్రీంకోర్టు, పీఎంవోకు లేఖ!





