SGSTV NEWS online
CrimeTelangana

ఆదివారం రూమ్ నుంచి బయటకు రాని యువతి.. ఫ్రెండ్ కిటికీలో తొంగి చూడగా



అమృత యూనివర్సిటీలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న శ్వేత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం సెలవు రోజు అందరితో సరదాగా గడిపిన ఆమె, ఉన్నట్లుండి గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. ఆ వివరాలు ఇలా ఓ సారి చూసేయండి.

ఆదివారం సెలవు కావడంతో విద్యార్థినులంతా సరదాగా గడుపుతున్నారు. ఉన్నట్లుండి తనకు ఒంటరిగా ఉండాలని ఉందని చెప్పి శ్వేత తన గదిలోకి వెళ్లింది. అయితే సాయంత్రం ఫోన్ చేసిన తల్లిదండ్రులకు శ్వేత నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్ చేసి శ్వేతతో మాట్లాడించాలని చెప్పారు. ఆమె వెళ్లి తలుపు కొట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి తొంగి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ శ్వేత కనిపించింది. వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించగా రంగంలోకి దిగిన సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్వేత చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

Also read

Related posts