రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లారి కల్లాపి కోసం వరండాలోకి వచ్చి చూడగా.. దెబ్బకు దడుసుకుని ఒక్కసారిగా అరిచింది ఒక ఆమె. ఇంతకీ ఆ వరండాలో ఏం కనిపించింది. అదేంటో.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
అసలే అమావాస్య.. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఊరు అంతా నిద్రపోయారు.. తెల్లారేసరికి ఇంటి ముందు వరండాలో చూస్తే ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏమైంది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నారంవారి గూడెం గ్రామంలో ఇంటి వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు ఇంటి యజమానులతో పాటు స్థానికులకు భయబ్రాంతులు కలిగించాయి.
అల్లాడి పద్మ ఇంటిలో అందరూ రాత్రి నిద్రించాక.. తెల్లవారుజామున ఇంటి వరండా శుభ్రం చేస్తుండగా ఒక ఎర్రటి గుడ్డలో ఉంచిన ఒక జంతు పుర్రె, నిమ్మకాయ, పసుపు, కుంకుమ పూజలు చేసినట్టు సామగ్రి ఉండటంతో ఆమె భయబ్రాంతులకు గురై చుట్టుప్రక్కల స్థానికులను పిలిచి విషయం చెప్పడంతో.. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని చూసి నిన్న అమావాస్య కావడంతో ఎవరో క్షుద్రపూజలు చేశారని భయబ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





