SGSTV NEWS online
CrimeTelangana

Telangana: ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరంలో.. ఉదయాన్నే భయానక దృశ్యం..



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలోని గోదావరి తీరంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు అనుమానిస్తున్న ఆనవాళ్లు కలకలం రేపాయి. బొమ్మకు మేకులు గుచ్చి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు జంతు బలి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.


ఎప్పుడూ ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా కనిపించే గోదావరి తీరం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సంతరించుకుంది. తెల్లవారుజామున గోదావరి తీరానికి వెళ్లిన స్థానికులు అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రక్తపు మరకలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఓ బొమ్మకు మేకులు గుచ్చిన ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామ పరిధిలోని గోదావరి తీరంలో చోటుచేసుకుంది. ఉదయం నదీ తీరానికి వెళ్లిన కొందరు స్థానికులు అక్కడి పరిస్థితులను గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిశీలించగా, భయానక దృశ్యాలు కనిపించాయి.

ఘటనా స్థలంలో ఓ బొమ్మను ఉంచి దానికి మేకులు గుచ్చినట్లు కనిపించింది. చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా కోళ్లు, మేకలను బలిచ్చినట్లు రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లు కూడా కనిపించాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ దృశ్యాలను చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంత భయంకరంగా క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటనను గతంలో ఎప్పుడూ చూడలేదని వారు చెబుతున్నారు. గోదావరి తీరం వంటి పవిత్ర ప్రదేశాన్ని ఇలాంటి కార్యకలాపాలకు వినియోగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ క్షుద్ర పూజలు ఎవరు నిర్వహించారు? వాటి వెనుక ఉద్దేశం ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రకృతి అందాలతో కళకళలాడే గోదావరి పరిసరాలు ఒక్కసారిగా క్షుద్ర పూజల ఆనవాళ్లతో కలకలం రేపడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే దానిపై గ్రామంలో చర్చ జరుగుతుండగా, నిజానిజాలు పోలీసుల దర్యాప్తులోనే తేలనున్నాయి.

Also read

Related posts