ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్టుడే: కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తమ వర్గం వారిని హత్య చేశారని.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మిగనూరు మండలంలోని కందనాతిలో వెంకటేశ్ (40), పరమేశ్ (35)ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. మరొక వ్యక్తి గోవింద్ ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వీరికి.. రెండేళ్ల క్రితం హత్యకు గురైన వర్గం వారికి వర్గపోరు నడుస్తోంది. గతంలో ఊరు వదిలి వెళ్లిపోయిన వైరి వర్గంవారు తిరిగి వచ్చారు. ఎప్పట్నుంచో వారి కోసం ఎదురు చూస్తోన్న ప్రత్యర్థులు పొలంలో పరమేశ్ను హత్య చేశారు. వెంకటేశ్ ను గ్రామంలో చంపేశారు. గోవింద్ పొలం నుంచి వస్తుండగా వేటకోడవళ్లతో దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి డీఎస్పీ భార్గవి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read
- డ్యామిట్ సీన్ రివర్స్.. లవర్పై పెట్రోల్ పోసి నప్పంటించే ప్రయత్నం.. కట్చేస్తే..
- Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
- సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి





