అనంతపురం జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో దారుణం.. ఎల్లమ్మకాలనీలో మరో దారుణం జరిగింది. భార్య లక్ష్మీ గంగ గొంతుకోసి హత్య చేశాడు భర్త వీరాంజనేయులు. ఆ తర్వాత.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. బిందెల కాలనీకి చెందిన లక్ష్మీగంగ (27), పామిడి మండల కేంద్రానికి చెందిన వీరాంజనేయులు పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎల్లమ్మ కాలనీలో నివాసముంటున్న వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లపాటు కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి.
భార్య లక్ష్మీ గంగపై అనుమానంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం (జనవరి 22) తెల్లవారుజామున కూడా భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవలోనే ఆవేశంతో గొంతు కోసి చంపేశాడు. నేరుగా స్టేషన్కు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోయాడు. వీరాంజనేయులు, లక్ష్మీ గంగ ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యను తానే హత్య చేశానని వీరాంజనేయులు అంగీకరించాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
- జైల్లో ఉన్న భర్తను బెయిల్పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
- బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్, కోల్కతాతో లింకులు బట్టబయలు..
- పుట్టింటికి వెళ్లిన భార్య.. వెంటే వచ్చిన భర్త.. అర్థరాత్రి భార్యను కత్తితో గొంతు కోసి పరార్..!
- భర్త వేధింపులు.. నువ్వు కన్యవేనా?





