బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిన మహిళా మర్డర్ కేసు వీడింది. అల్లుడే ఆమెను19 ముక్కలుగా నరికి చంపేశాడు. రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లో దొరికిన మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతురాలిని బెళ్లావికి చెందిన లక్ష్మీ దేవి (42) గుర్తించారు.
బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిన మహిళా మర్డర్ కేసు వీడింది. అల్లుడే ఆమెను19 ముక్కలుగా నరికి చంపేశాడు. రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లో దొరికిన మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతురాలిని బెళ్లావికి చెందిన లక్ష్మీ దేవి (42) గుర్తించారు. ఓ ఆసుపత్రిలో డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్న అల్లుడు రామచంద్ర.. అత్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమెను హతమార్చినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. లక్ష్మీ దేవిని 19ముక్కలుగా కోసి, 14 ప్లాస్టిక్ కవర్లలో కుక్కి పడేశాడు రామచంద్ర. అతనికి సపోర్ట్ చేసిన మరో ఇద్దరు సతీష్ కెఎన్ (38), కిరణ్ కెఎస్ (32)లను కూడా కోరటగెరె పోలీసులు అరెస్ట్ చేశారు.
రామచంద్రయ్య తన అత్తను చంపడానికి ఆరు నెలల ముందే పక్కా ప్లాన్ వేశాడు. ఆగస్టు 3న, లక్షీదేవి తన కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తున్నప్పుడు, రామచంద్రయ్య ఆమెను తన కారులో ఎక్కించుకుని, తన ఇద్దరు స్నేహితులతో కలిసి కలిసి ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత శవాన్ని తుమకూరులోని సతీష్ పొలానికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ముగ్గురు కలిసి శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, 19 వేర్వేరు ప్రదేశాలలో పారేశారు. దీనివల్ల బాధితురాలు ఎవరు అనేది గుర్తించకుండా చేయాలని భావించారు.
తుమకూరులో సంచలనం
అయితే పోలీసులకు ఆమె శరీర భాగాలపై ఉన్న ఆభరణాలు, టాటూల ఆధారంగా ఆమెను గుర్తించారు. ఈ కేసు తుమకూరులో సంచలనం సృష్టించింది. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమెను హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రాధమికంగా 2019లో లక్ష్మీ దేవి కుమార్తె తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు డాక్టర్ రామచంద్రయ్య. అయితే తమ వివాహంలో తన అత్త జోక్యం చేసుకోవడం పట్ల కలత చెందినట్లు సమాచారం. తన భార్యను ప్రభావితం చేసి ఇంట్లో విభేదాలు సృష్టించినందుకు ఆమెను చంపాలని స్కెచ్ వేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా డాక్టర్ రామచంద్రయ్య మొదటి భార్యతో విడాకుల ప్రక్రియ ఇంకా కోర్టులో కొనసాగుతోంది.
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





