డబ్బు తీసుకుని.. దారుణానికి సహకరించిన వైనం
నరసరావుపేట: మాచర్ల పరువు హత్య ఘటనలో ఓ పోలీసు అధికారి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమపెళ్లి చేసుకుందని చౌడేశ్వరి(23)ని ఆమె తండ్రే హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో… ఆమె ఆచూకీ కనిపెట్టి, తండ్రికి అప్పగించింది ఓ పోలీసు అధికారేనని తేలింది. కుమార్తె ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తే సదరు పోలీసుకు భారీ మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. రెండు విడతలుగా నగదు ఇచ్చినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడని సమాచారం.
ఎలా చేశారంటే..
ప్రేమపెళ్లి చేసుకున్న నాగరాజు, చౌడేశ్వరి జంట నరసరావుపేట మండలం పెదతురకపాలేనికి చెందిన ఖాజా సాయంతో నరసరావుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఖాజాను నరసరావుపేట రూరల్ పోలీసులు పట్టుకుని విచారించగా కొత్తజంట ఆచూకీ చెప్పాడు. మాచర్ల పోలీసులు వారిద్దరినీ తీసుకెళ్లారు. తాను మేజర్న్న, నాగరాజుతోనే ఉంటానని చౌడేశ్వరి చెప్పినా.. ఆ అధికారి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమెను చంపినరోజు ఆ అధికారి సెలవులో ఉన్నారు. పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేయాలనుకున్నా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో హత్యోదంతం బయటపడింది.
Also read
- ఆమె వల్ల పరువు పోతోంది.. చంపేయ్.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి
- కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
- ఫోక్సో కేసులో యువకుడి అరెస్ట్.. ఆరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకే ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు!
- ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!





