కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదు. ఎమ్మెల్యే ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read :జోగి రమేష్ పేరు చెప్పి రూ.15 లక్షల టోకరా
గొంతులో గులకరాయి ఇరుక్కొని చిన్నారి మృతి
AP news: జగన్ కు ఓటెయ్యాలని బెదిరించారు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకం