భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై తారాజువ్వ పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై ప్రమాదవశాత్తు ఓ తారాజువ్వ ఎగిరి పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతుండడంతో ఆలయంలోని భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. కొంతమంది సాహసం చేసి పందిరి పై తాటాకులను తీసి కింద పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు.
వీడియో
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





