భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై తారాజువ్వ పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై ప్రమాదవశాత్తు ఓ తారాజువ్వ ఎగిరి పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతుండడంతో ఆలయంలోని భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. కొంతమంది సాహసం చేసి పందిరి పై తాటాకులను తీసి కింద పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు.
వీడియో
Also read
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత