కర్నూలు : కర్నూలులో టీడీపీ కార్యకర్త తైజుమ్ బాషాపై హత్యాయత్నం కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులుగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు జలీల్, జునైత్, ఫైజల్, ఆరిఫ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అనంతరం నిందితులను వన్న్ పీఎస్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
ఇటీవల తైజుమ్ బాషాపై నిందితులు విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించారు. బాషా తన ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాటు వేసిన వైకాపా కార్యకర్తలు.. అతడిపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న బాషాను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల సవరణ కార్యక్రమంలో వైసీపీ తప్పులు కనిపెడుతున్నారని, టీడీపీ లో యాక్టివ్ గా ఉన్నాడనే కారణంతో బాషాపై నిందితులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
Also read
- Shiva Mantra: “ఓం నమః శివాయ” మంత్రాన్ని శివభక్తులు అంతగా జపించడానికి కారణం ఏంటి.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం.. వీరికి చేస్తే దోషమట!
- Vakshadhana: వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి.. లక్ష్మీదేవి, పరమశివుని అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఇవే!
- టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్
- Garuda Puran: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!





