అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది.
తాడ్వాయి: అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుజాత (48) మండలంలోని కాటాపురంలో అంగన్వాడీ టీచర్ విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఏటూరునాగారం బయలుదేరారు. బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అడవికి వెళ్లిన తునికాకు కూలీలకు సుజాత మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ శంకర్, ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి మెడకు స్కార్ఫన్ను చుట్టి ఉరి వేసినట్లు గుర్తించారు. సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.
Also read
- అమ్మాయి పేరు మీద 2 కోట్ల భూమి.. కొన్నేళ్లకు ఎంట్రీ ఇచ్చిన మేనమామ.. మధ్యలో పోలీసులు.. చివరకు..
- స్కానింగ్ సెంటర్లో రిపోర్ట్లు తారుమారు! గర్భిణికి గుడ్డిగా మందులు రాసిచ్చిన డాక్టర్.. ఆ తర్వాత
- గంటల వ్యవధిలోనే తల్లి, శిశువు మృతి.. ఆసుపత్రిలో అసలేం జరిగింది..
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!