SGSTV NEWS
Andhra PradeshCrime

Chittoor: స్నానం చేసి వచ్చి దుస్తుల కోసం ఆ బ్యాగులో చేయి పెట్టాడు.. అంతే ఖతం..



ఇదో హెచ్చరిక.. పాములు ఎంత ప్రమాదకరంగా నక్కి ఉంటాయో చెప్పే ఓ సూచిక. ఇప్పుడు వేడి తాపం, దాహార్తితో పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. అవి ఎక్కడ నక్కి ఉంటాయో చెప్పలేం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, పొలాలకుసమీపాన నివశించేవారు ఇంకా అప్రమత్తంగా ఉండాలి.

పాములు చాలా ప్రమాదకారం. అవి ఇప్పుడు వేసవి తాపానికి జనావాసాల్లోకి వచ్చి.. ఇళ్లలో నక్కుతున్నాయి. ఆదమరిచి అలక్ష్యంగా ఉంటే కాటు పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తిని అలానే ఓ పాము బలి తీసుకుంది. తన దుస్తులను ఆ వ్యక్తి ఇంట్లోని ఓ బ్యాగులో ఉంచాడు. స్నానం చేసి వచ్చి దుస్తుల కోసం ఆ సంచిలో చేయి పెట్టాడు. అంతే అందులో ఉన్న తాచుపాము అతడిని కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండానే.. మార్గమధ్యంలో చనిపోయాడు. అప్పటివరకు చలాకీగా ఉన్న వ్యక్తి పాము కాటుతో నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చిత్తూరు జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది.

పాలసముద్రం గ్రామంలో 49 ఏళ్ల దేవానందం కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంట్లో తన దుస్తులను ఓ బ్యాగులో పెట్టాడు. స్నానం చేశాక దుస్తుల కోసం సంచిలో చేయి పెట్టడంతో అందులో దాగిఉన్న తాచుపాము కాటేసింది. వెంటనే దేవానందం ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అతడిని హుటాహుటిన గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న ఏఎన్‌ఎంలు దేవానందంకు టీటీ ఇంజెక్షన్‌ చేశారు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు.

ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరని..  పాముకాటు విరుగుడుకు ఇంజెక్షన్‌ వేయకుండా.. టీటీ వేయడంతోనే దేవానందం మరణించాడని  ఆరోపిస్తూ స్థానిక ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే డాక్టర్లు లేకుండా తాము పాముకాటు ఇంజెక్షన్‌ వేయరాదని ఏఎన్‌ఎంలు చెబుతున్నారు. ఏది ఏమైతేనేం.. పాము మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. దేశంలో ఏటా 50,000ల మంది పాము కాటుకు బలవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి

Also read

Related posts

Share this