తెల్లారేసరికి ఇంటి బయటకు వచ్చిన ఓ వ్యక్తీకి.. ఎదురుగా పెద్ద గుంత కనిపించింది. ఆ ప్రాంతంలో ఏదో భూమి కృంగినట్టుగా ఉంది. అయితే ఆ గుంత లోపల ఏదో ఉందని అనుమానమొచ్చిన గ్రామస్తులకు వెళ్లి చూడగా.. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది. గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది. ఏంటా అని స్థానికులు పరిశీలించగా.. ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు.
ఈ పురాతన శివాలయం రాజుల కాలం నాటిది. ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాళ్లు లేకుండా చేశారు. ఆ శివాలయం భూమి కింద ఉన్నది. బెస్త మద్దిలేటి అనే అతను శివాలయం ఉందని తెలియక ఇల్లు కట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం శివాలయం ఉందని తెలిసింది. తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయటం కోసం పేరు సోమల గ్రామస్తుల సమక్షంలో బెస్త మద్దిలేటి శివాలయానికి పూడికతీత తీసి దారి ఏర్పాటు చేశారు. శివాలయం గుడికి ప్రక్కనే పెద్ద కోనేరు ఉన్న ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. దీంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పూజలు చేయడం మొదలు పెట్టారు. తెలుగు సంవత్సర ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..