చేప పిల్లలకు ఈత ఎవరైనా నేర్పుతారా??? అలాగే మత్స్యకారుడికి చేపల వేట ఎలా చేయాలో ఎవరైనా నేర్పుతారా??? మత్స్యకారుడు అంటేనే నిత్యం నీటిలో వల పట్టుకుని చేపలు వేట చేయడం. అలాంటి జాలరిని తనకు ఇన్నాళ్లు అన్నం పెట్టిన వలే ఉసురు తీసింది. చేపల కోసం వేసిన వలే… ఆ మత్స్యకారుడి పాలిట ఉరితాడు అయింది.
శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని చెరువులో చేపల వేటకు వెళ్లి నాగేశ్వరరావు అనే మత్స్యకారుడు మృతి చెందాడు. చేపల వేట కోసం చెరువులో వేసిన ఉచ్చు లాంటి వలలో మత్స్యకారుడు చిక్కుకున్నాడు. చేపల కోసం వేసిన వల మత్స్యకారుడిని బలి తీసుకుంది. నాగేశ్వరరావు అనే మత్స్యకారుడు చేపల కోసం చెరువులో వల వేసి… ఉచ్చు బిగించి ఒడ్డుకు వచ్చాడు. కాసేపటికి వలలో చేపలు చిక్కాయని… చెరువులోకి దిగిన మత్స్యకారుడు నాగేశ్వరరావు కాళ్లకు… తాను వేసిన వలే.. చుట్టుకుని చిక్కుకుంది… దీంతో అతను ఈత కొట్టలేక… వల చిక్కుముడి విడిపించుకోలేక…. ఊపిరాడక మత్స్యకారుడు నాగేశ్వరావు చెరువులోనే మృతి చెందాడు.
చేపల వేటకు అని వెళ్లిన నాగేశ్వరరావు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో… చెరువు దగ్గరకు వెళ్లిన కుమారుడికి… చెరువు ఒడ్డున తండ్రి నాగేశ్వరావుకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. దీంతో కుమారుడు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చి… చెరువులో గాలింపు చేపట్టారు. కాసేపటికి నాగేశ్వరరావు మృతదేహం చెరువులో దొరికింది. అయితే మత్స్యకారుడు నాగేశ్వరావు కాళ్లకు చేపల కోసం వేసిన వల చుట్టుకోవడంతో… ఈత కొట్టలేక చెరువులో మునిగి మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. విధి ఎంత విచిత్రమైనది అంటే… నిత్యం చేపల వేటకు వెళ్లి… అదే పని చేసుకుంటూ జీవనం సాగించే మత్స్యకారుడిని…. అదే వృత్తి మృత్యువు రూపంలో కబలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





