పొట్టకూటి కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కుటుంబాలు మాత్రం స్మశానంలోని చితాభస్మంలో స్వర్ణాన్వేషణ చేపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇంతకూ ఈ విధంగా జీవనం సాగించే తెగవారు ఎక్కడ ఉన్నారు..? వారు ఎంత కాలంగా ఇలా జీవిస్తున్నారు..?
మనిషి జీవించడానికి ఎన్నో రకాల పనులను చేస్తుంటాడు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన నైపుణ్యం కలిగి.. ఆయా రంగాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కుటుంబాలు మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే.. వారు స్మశానంలో స్వర్ణావేషణ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. దహనం చేసిన పార్ధీవదేహం నుంచి బంగారం తీసి.. దాన్ని అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. దీంతో అసలు దహనం చేసిన మృతదేహం నుంచి బంగారం ఎలా లభిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత స్మశానంలో దహన సంస్కారాలైన తర్వాత చితాభస్మంను చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం కుటుంబ సభ్యులు కాశీలో లేదా గంగలో కలుపుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారి నోటిలో కొంత బంగారాన్ని పెట్టి సాగనంపడం ఆనవాయితీగా వస్తోంది. మరికొందరు రేకు చనిపోయిన వారి నోట్లో పెడితే.. మరికొందరు వారు వాడిన ఉంగరాలు, దిద్దులు పెట్టి.. తమ ప్రేమ చాటుతుంటారు. ఇప్పటికే పలుచోట్ల ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని పలు కుటుంబాలు స్మశానంలోని చితాభస్మం నుంచి వచ్చే బంగారం తీసి.. విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తుంటారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో స్మశానం నుంచి తీసిన చితాభస్మంలో కొంత గంగలో కలపటానికి కుటుంబ సభ్యులు తీసుకోగా.. మిగిలిన చితాభస్మం నుంచి బంగారం తీసి, అ బంగారం మార్కెట్లో అమ్మి జీవనం సాగిస్తున్నాయి కొన్ని కుటుంబాలు. జగ్గయ్యపేట స్మశానం సమీపంలో జీవించే ఒక తెగవారు.. స్మశానంలో భస్మం చేసిన చితాభస్మంను పక్కనే ఉన్న పాలేటిలో కడిగి అందులో నుంచి బంగారం తీస్తారు. ఇలా వారు జీవనం సాగిస్తుండటంతో.. ఈ విషయం తెలిసి అందరు విస్తుపోతున్నారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!