అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యంత్ర సామగ్రి, స్పేర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..
అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి16 : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ప్రాంతంలో గల నీరుగట్టువారిపల్లెలో అమృత ట్రేడర్స్ పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో సోమవారం ఆగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని స్పేర్ పార్ట్స్, యంత్ర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిళ్లిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి, పరిస్థితిని నియంత్రించారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో సాంకేతిక పరికరాలు, విద్యుత్ సరఫరా తదితరాలను పరిశీలించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మరణానంతరం గరుడ పురాణం ఎందుకు చదువుతారు? 13 రోజుల పారాయణం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Mysterious Temple: ఈ ఆలయంలో దెయ్యాలకు శిక్ష పడుతుందట..! ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఆత్మహత్య




