శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా… డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్ అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాదు నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చి చిప్ అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలు మనం చూసాం… కానీ అనంతపురం జిల్లాలో జరిగిన ఈ మోసం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అంటున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు… విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పెట్రోల్ బంకులు కొత్త రకం మోసం బయటపడింది. ఎలక్ట్రికల్ చిప్ అమర్చి రీడింగ్ ను టాంపర్ చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యాలు… వాహనదారులను నిలువున మోసం చేస్తున్నాయి. ఆఖరికి లీగల్ మెట్రాలాజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ ల గుట్టును విజిలెన్స్ అధికారులు బట్ట బయలు చేశారు.
పక్కా సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనంతపురం శివారు ప్రాంతమైన సోమలదొడ్డిలోని శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా… డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్ అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాదు నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చి చిప్ అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
ఒక్క సంవత్సరంలో రెండు లక్షల పై చిలుకు లీటర్ల డీజిల్ ని మిగుల్చుకున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం… వాహనదారుల నుంచి దాదాపు రెండు కోట్ల పైచిలుకు డబ్బు అక్రమంగా సంపాదించినట్లు తెలుసుకున్న విజిలెన్స్ అధికారులే కంగుతున్నారు. దీంతో విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంకులో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో చిప్ బాగోతం బయటపడింది. ఒక సంవత్సరంలోనే సుమారు ఒక పంపు ద్వారా రెండు కోట్ల పైచిలుకు రూపాయిలు మోసం చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో అధికారులు గుర్తించారు.
ఇలాంటి చిప్ లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ లు జిల్లాల్లో ఇంకా ఉన్నట్లు… అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేస్తాం అంటున్నారు విజిలెన్స్ డిఎస్పి నాగభూషణం…. ఈ తరహా ఎలక్ట్రికల్ చీప్ అమర్చి పెట్రోల్ బంకుల్లో డీజిల్ మోసం చేయడం ఇదే మొదటిసారి అంటున్నారు విజిలెన్స్ అధికారులు. గతంలో తూనికలు కొలతలకు సంబంధించిన అధికారులు సీల్ను తొలగించి అనేక మోసాలకు పాల్ప పెట్రోల్ బంక్ యజమానులు… ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ చిప్ అమర్చి మోసాలకు పాల్పడటం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది
Also read
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?