July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతి దివిటివారిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

అడ్డుకోబోయిన యువకుడి గొంతకోసి పరార్‌

Also read :అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..

నిమ్మనపల్లి, జూన : నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతి దివిటివారిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు దివిటివారిపల్లి సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓమహిళను అతి కిరాతకంగా నరికి చంపారు. అదే సమయం దివిటివారిపల్లికి చెందిన రామాంజులు(27) పొలం వద్దకు వెళుతున్న వారిని అక్కడ జరుగుతున్న దానిని చూసి అడ్డుకోబోయాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రామాంజులపై కత్తిలో దాడి చేసి గొంతు కోసి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ప్రాణాపాయ స్థితిలో వున్న రామాంజులను గ్రామస్థులు గమనించి మదనపల్లి ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రాయాంజులకు అప్పటికే కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు. రామాంజులు మెలు కువస్తేగాని చనిపోయిన మహిళ ఎవరు, గుర్తుతెలియని వ్యక్తులు ఎవరు అనే విషయం బయటకు రానుంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read :Hyderabad: పాతబస్తీలో అమానుషం.. రూ.10 కోసం ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపిన ప్రయాణికుడు….

Related posts

Share via