రాజమహేంద్రవరం :
ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి చూసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చలించారు. స్థానిక 3వ డివిజన్ రాజేంద్రనగర్కు చెందిన బి యశ్వంత్ అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున వేడి నీలల్లో పడ్డారు. దీంతో అతడి శరీరం బొబ్బలెక్కి తీవ్రంగా గాయపడింది. దీంతో అతడి తల్లిదండ్రులు వైద్యం దానవాయిపేటలోని శ్రీ హాస్పటల్కు తీసుకువెళ్లగా సదరు విషయాన్ని ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ బాబును పరామర్శించి అతడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాలుడి పరిస్థితి అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారిని చూసి చల్లించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. అలాగే ఆ బాలుడి వైద్యం కోసం అయ్యే ఖర్చంతా తామే తమ భవానీ చారిటబుల్ ట్రస్టు తరపున భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆ బాలుడికి వైద్యం కోసం అయిన రూ.30,000 వైద్య ఖర్చును ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీ మేరకు బాలుడికి ఆర్థిక సహాకారం అందించడం జరిగిందన్నారు. తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఇప్పటికే వేలాది మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, పేదలకు వైద్య ఖర్చుల కోసం ఆర్ధిక సహకారం అందించడం జరిగిందన్నారు. తమ ట్రస్టు తరపున భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను ఇలానే కొనసాగిస్తామన్నారు.
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





