పీటీ వారెంట్పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించిన పోలీసులు సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టుకు తరలింపు
వాహనంలో నుంచి గెడ్డం మీద చేయి వేసి పుష్ప స్టైల్లో స్పందన
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు పుష్ప స్టైల్లో ‘తగ్గేదేలే’ అంటూ స్పందించారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా అంబటి రాంబాబు కూడా వ్యాన్లో సీటు మీద కూర్చుని గెడ్డం కింద చేయిని స్టైల్గా పెట్టి ‘తగ్గేదేలే’ అనే స్టైల్లో రియాక్షన్ ఇచ్చారు. ఆయనను కోర్టుకు తీసుకువస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంబటి రాంబాబు గత నెల 31వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, 2023లో లాటరీ ద్వారా అవినీతికి పాల్పడ్డారని సత్తెనపల్లి జనసేన నేతలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.
Also read
- April 2026 Horoscope: ఏప్రిల్ మాసంలో ఆర్థికంగా వారికి జాక్పాట్.. మీ రాశికి ఎలా ఉందంటే..?
- రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
- నగరంలో నయా దళారులు.. సాఫ్ట్వేర్, రైల్వే ఉద్యోగుల మత్తు దందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
- విద్యార్థినిపై అత్యాచారం కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు వీళ్లు గురువులేనా?
- పిల్లలిద్దరూ లండన్లో వెల్ సెటిల్డ్.. అయినా ఎందుకు ఆంటీ ఈ పనులు





