October 17, 2024
SGSTV NEWS
CrimeNational

2 రోజులుగా కనిపించని యువతి! అర్ధరాత్రి ఫోన్! పోలీసులే షాకయ్యే క్రైమ్!

Mumbai Crime News: ఇప్పటికే ప్రేమ వ్యవహారం కారణంగా ఎంతో మంది యువతులు హత్యకు గురి కాగా.. తాజాగా 20 ఏళ్ల యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. కత్తిపోట్లతో చెట్ల పొదల్లో శవమైంది.

ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కారణంగా జరుగుతున్న దారుణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమించలేదని, ప్రేమ పేరుతో మోసం చేశారని, వేరే వారితో తన లవర్ మాట్లాడుతుందని.. ఇలా అనేక రకాల కారణాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది యువతలు ప్రేమోన్మాదుల చేతిలో బలయ్యారు. ఈ తరహాలోనే తాజాగా ఓ 20 ఏళ్ల యువతి కూడా దారుణ హత్యకు గురైంది. చెట్ల పొదల్లో శవమై స్థానికులకు కనిపించింది. ఈ ఘటన నవీ ముంబై నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

Also read :Hyderabad Drugs: సిటీలో ఎక్కడ చూసినా డ్రగ్స్ కంపే..! మత్తులో చిత్తవుతున్న యువత..!

శనివారం నవీ ముంబై నగరంలో 20 ఏళ్ల యువతి శవం కనిపించింది. ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో యువతి మృతదేహం ఉందని..శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో పోలీసులకు సమాచారం వెళ్లింది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఆమె ఒంటిపై తీవ్రంగా గాయాలు, కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక ఆ యువతిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు అక్కడ పరిస్థితిని బట్టి పోలీసులు అంచనా వేశారు. ఇక హత్యగురైన యువతి యశశ్రీ షిండే గా పోలీసులు గుర్తించారు. ఆమె రెండు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయి..శనివారం శవమై కనిపించింది.

Also read :Building Collapse: కుప్ప కూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు?.. కొన‌సాగుతున్న రెస్క్యూ

యశశ్రీ షిండే ముంబై లోని ఉరాన్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. అలానే తాను నివాసం ఉండే ఉరాన్ కి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేలా పూర్ లో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో శవమైన కనిపించింది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ యువతి హత్యకు గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యశశ్రీకి, ఆమె లవర్ కి మధ్య వాగ్వాదం జరిగి.. ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆ యువతితో పాటు ఆమె ప్రియుడు కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆమె శవమై కనిపించగా.. అతడి గురించి ఇంకా ఆచూకి లభించలేదు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు.

Also read :రాష్ట్రానికి రాలేననుకున్నా – మంత్రి లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర*

ఇది ఇలా ఉంటే ప్రేమోన్మాదులు కారణంగా ఎంతో మంది అమాయకపు యువతుల నిండు జీవితం బలైపోతుంది. ప్రేమించి కొందరు కేటుగాళ్లు మోసం చేస్తే..ప్రేమించలేదని కారణంతో మరికొందరు దుర్మార్గులు యువతులపై దారుణాలకు తెగబడుతున్నారు. ఇటీవలే ఓ ప్రాంతంలో యువతిని అత్యంత దారుణంగా కత్తితో చంపి.. ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రేమోన్మాది. అలానే మూడు రోజుల క్రితం బెంగళూరు నగరంలో పీజీలో ఉండే ఓ యువతి.. ఓ యువకుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యశశ్రీ షిండే మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది.

Also read :కొడవలి తో కొడుకు ఛాతి ని గాయపరిచిన తల్లిదండ్రులు

Related posts

Share via