గూడూరు: సెల్ఫోన్ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు-కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది.
శనివారం రాత్రి సెల్ఫోన్ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు.
Also read
- సెల్ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
- వారం క్రితం మిస్సైన బీటెక్ విద్యార్థి మృతి.. బాడీ ఎక్కడ దొరికిందంటే?
- ఊళ్ళో దెయ్యాలు – భూతాలను తరిమేస్తామంటూ వచ్చారు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి





