July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Eluru: ప్రేమోన్మాదానికి యువతి బలి.. ఏలూరులో నడిరోడ్డుపై ఘాతుకం

ప్రేమోన్మాదం ఓ యువతిని బలిగొంది. ప్రేమించాలంటూ వెంట పడి వేధిస్తున్న ఓ యువకుడు చివరకు ఆ యువతిని పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో పాశవికంగా నరికి హతమార్చాడు.

ఏలూరు : ప్రేమోన్మాదం ఓ యువతిని బలిగొంది. ప్రేమించాలంటూ వెంట పడి వేధిస్తున్న ఓ యువకుడు చివరకు ఆ యువతిని పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో పాశవికంగా నరికి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. పోలీసులు ఆ యువకుడిని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు పంపించారు. యువతి మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఏలూరు నగర శివారు సత్రంపాడులో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్రంపాడు. ఎంఆర్సీ కాలనీలో నివాసముంటున్న జక్కుల రామారావుకు ఇద్దరు భార్యలు. రెండో భార్య రాజ్యలక్ష్మి, రామారావుల ఏకైక కుమార్తె రత్నాగ్రేస్ అలియాస్ స్వీటీ(23) సత్రంపాడులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ పూర్తిచేసింది. ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఈమె డిగ్రీ చదువుతున్నప్పుడు ముసునూరుకు చెందిన కట్టుబోయిన ఏసురత్నం పరిచయమయ్యాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ తరువాత ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. 2023లో వీరి చదువు పూర్తికాగా  ఏసురత్నం అప్పుడప్పుడు ఏలూరు వచ్చి రత్నాగ్రేస్ ను కలిసి ప్రేమించాలంటూ వేధించేవాడు. కొద్ది రోజుల కిందట ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఏసురత్నం తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసి అతన్ని మందలించారు.

వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే విషాదం

రత్నాగ్రేస్ కు ఈ నెల 26న నిశ్చితార్థమైంది. జూన్ 16న వివాహం. పెళ్లి విషయం తెలుసుకున్న ఏసురత్నం ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని, లేకుంటే ఇంకెవరికీ దక్కకూడదని భావించాడు. రత్నాగ్రేస్ గురువారం యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం తను పనిచేసే స్కూలు పక్కనే ఉన్న బ్యాంకు వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు బయలుదేరింది. అప్పటికే అక్కడ ఉన్న ఏసురత్నం మాట్లాడే పని ఉందని చెప్పాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ పక్క వీధిలోకి వెళ్లారు. తననే వివాహం చేసుకోవాలని.. లేదంటే చంపేస్తానని బెదిరించాడు. తనకు పెళ్లి నిశ్చయమైందని రత్నాగ్రేస్ చెప్పడంతో కోపోద్రిక్తుడైన ఏసురత్నం బ్యాగులో తెచ్చుకున్న కత్తిని తీసి.. తనను చంపెయ్ అంటూ ఆమె చేతికిచ్చాడు. అందుకు ఆమె వారించింది. ఇంతలోనే అతను ఆమె మెడపై విచక్షణారహితంగా నరికాడు. రక్తపుమడుగులో పడి ఆమె మృతిచెందింది. తరువాత అతను తన గొంతు కోసుకున్నాడు. మెడ భాగంలో తెగడంతో అక్కడే రక్తపు మడుగులో పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

Also read

Related posts

Share via