వరంగల్ : ఆన్ లైన్ బెట్టింగ్కు యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమారస్వామిల మూడవ కొడుకు లైశెట్టి రాజు కుమార్ (26) డిగ్రీ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈక్రమంలో … ఆన్ లైన్ బెట్టింగు మోజులోపడి సుమారు 30 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. గత వారం రోజులుగా తనకు 4 లక్షల రూపాయలు కావాలని తండ్రిని రాజు కుమార్ వేధించాడు. అయితే యువకుడికి తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం ఇంటికి తాళం వేసి తండ్రి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు విగతజీవిగా కనిపించడంతో రోదించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- TG Murder: భూ వివాదంలో తండ్రి హతం.. పగతో పెద్దమ్మను గొడ్డలితో నరికిన కొడుకు!
- Vastu Tips: అక్వేరియంలో ఎన్ని చేపలుంచాలి.. ఈ దోషాలకు వాస్తు శాస్త్రం చెప్తున్న సింపుల్ రెమిడీ..
- త్వరలోనే గజలక్ష్మి రాజ యోగం.. ఈ 3 రాశులకు ఇక ఆదాయం రెట్టింపు, సంతోషం మూడింతలు..!
- Budh Gochar 2025: రేపు మేష రాశిలో బుధాదిత్య యోగం.. ఈ రాశుల ఉద్యోగ, వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే..
- Tulasi Puja Tips: తులసి మొక్క పూజకు నియమాలున్నాయి.. ఈ రోజుల్లో పొరపాటున కూడా నీరు పోయవద్దు.. ఎదుకంటే..