పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు. పాము కాటును సీరియస్ గా తీసుకోకుండా ఉండడంతో సాయంత్రం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబీకులు హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలిక పరిస్థితి విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం సూచించారు. దీంతో హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 20) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సింధుజ దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సింధుజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also read
- మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు చెప్పేది ఏమిటి!
- నేటి జాతకములు…22 మార్చి, 2026
- Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో సంచలన ట్విస్ట్! వెలుగులోకి..
- Andhra News: ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా దగ్గరకు వెళ్లి చూడగా
- పరాయి మోజు ప్రాణం తీసింది.. ప్రియుడి మాయలో పడి భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!





