July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Chandrababu: చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌ ఆలయంలో నాలుక కోసుకున్న వ్యక్తి

శ్రీనగర్‌కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు
ఆపై బ్లేడుతో నాలుక కోసుకున్న వైనం

ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

కూటమి 100 నుంచి 145 స్థానాల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాడు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా తిరిగి చూడాలని కోరుకునేవాడు. ఈ క్రమంలో స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ మహేశ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 100 నుంచి 145 సీట్లలో గెలవాలని ఆకాంక్షించాడు. కాగా, జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ గతంలోనూ మహేశ్ ఇలాంటి పనే చేసినట్టు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via