దుమ్ముగూడెం, : మూసేసిన పాఠశాలను తిరిగి తెరిపించారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మావోయిస్టులు హత్య చేశారు. సుక్మా జిల్లా గోండ్పల్లికి చెందిన ఉపాధ్యాయుడు దూది అర్జున్(35) ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం కొందరు మావోయిస్టులు అపహరించారు. సమీప అటవీప్రాంతంలో ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆయనపై పలు ఆరోపణలు చేశారు. మావోయిస్టులు కొంతకాలం కిందట గ్రామస్థులను బెదిరించి ప్రభుత్వ పాఠశాలను మూసివేయించారు. అధికారుల సహాయంతో ఇటీవల పాఠశాలను తిరిగి ప్రారంభించడంలో ఉపాధ్యాయుడు అర్జున్ ప్రముఖపాత్ర పోషించారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ప్రజాకోర్టులో కర్రలతో కొట్టి.. హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.
- AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?