పెర్కిట్(ఆర్మూర్): వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారిని కూలర్ బలితీసుకుంది. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్లో నివసించే దీపిక, వినీత్ దంపతులకు ఆరేళ్ల కూతురు శృతిక ఉంది.
ఎండాకాలం సెలవులు రావడంతో శృతిక పెర్కిట్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. శనివారం రాత్రి అమ్మమ్మ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా శృతిక ఆడుకుంటూ ఇనుప కూలర్ వద్దకు వెళ్లి, దానిని తాకింది. కూలర్కు విద్యుత్ ప్రసారం కావడంతో శృతిక విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటివరకు ఆడుకుంటూ సరదాగా గడిపిన చిన్నారి అంతలోనే విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..
- బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
- Hyderabad : మరో అమ్మాయితో లవర్ కి పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!