నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం లో జరిగింది
చిన్నాపూర్ (మోపాల్) : నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. ఎస్ చ్వో గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం పొతంగల్ గ్రామానికి చెందిన గంగాధర్, స్వరూపలకు ఇద్దరు కుమార్తెలు. స్వరూప.. భర్త, పిల్లలతో కలిసి బుధవారం మోపాల్ మండలం చిన్నాపూర్లోని సోదరి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం స్నేహితను ఆడిస్తూ ఉండమని మూడేళ్ల పెద్ద కుమార్తెకు చెప్పి స్వరూప స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నిండుగా నీళ్లు ఉన్న బకెట్లో స్నేహిత తలకిందులుగా కనిపించింది. ఆమెను బయటకు తీసి పెద్దగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు చిన్నారి తాగిన నీళ్లను బయటకితీసే ప్రయత్నం చేసేలోపే చనిపోయింది.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




