SGSTV NEWS
CrimeTelangana

బాలికపై లైంగిక దాడి  నిందితుడిపై కేసు నమోదు

అమీర్‌పేట్‌ స్నాఫ్‌ చాట్‌లో పరిచయమైన బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అమీర్‌పేట సోనాబాయి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గణేష్‌ యాదవ్‌కు ఓ బాలిక(14)తో స్నాప్‌ చాట్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రోజు సదరు బాలికతో తరచూ మాట్లాడుతుండేవాడు ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించిన అతను వాటిని చూపి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share this