నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. మద్యానికి బానిసైన భర్త కిరణ్పై అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న హత్య చేసి పరారయ్యాడు.
TG Crime: ఓ జంట రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య గొడవలు రావటంతో మద్యానికి బానిసైయ్యాడు. దీంతో భర్త చెప్పిన మాట వినటం లేదని భార్య ఘర్షణ పడింది. గొడవ పెరిగి పెద్ద మనుషుల వరకు చేరింది. చివరికి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం
దంపతుల మధ్య తరచూ గొడవలు..
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త కిరణ్ గత కొంతకాలంగా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త కొంతకాలంగా బంధువుల ఇళ్లలో ఉంటున్నాడు. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది
దీంతో భార్యపై కోపం పెంచుకున్న కిరణ్.. అక్కడే అరుణను గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అరుణ చనిపోవటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారని అనుకుంటే ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాంట్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరు రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. భార్య అరుణ పెద్ద మనుషుల్లో కిరణ్ను తిట్టడం వల్లే క్షణికావేశంతో హత్య చేశాడని సాక్ష్యులు చెబుతున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!