తెలంగాణ ప్రభుత్వం టీఎస్ కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు ఖర్చవుతాయని సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ నోట్ ను రూపొందించారు. దీనిపై విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దాన్ని సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ నోట్ ను ప్రచారం కావడంపై ప్రభుత్వం సీరియస్ కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also read
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..





