తెలంగాణ ప్రభుత్వం టీఎస్ కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు ఖర్చవుతాయని సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ నోట్ ను రూపొందించారు. దీనిపై విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దాన్ని సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ నోట్ ను ప్రచారం కావడంపై ప్రభుత్వం సీరియస్ కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also read
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?
- నేటి జాతకములు..2 మే, 2026
- చెడు కొలెస్ట్రాల్ను సహజంగా కరిగించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే!
- Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..
- ఎన్నడూ చూడని దృశ్యం.. 20 అడుగుల కొండచిలువ ఎలా చెట్టు ఎక్కుతుందో చూడండి..





