జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫత్తేపూర్ శివారు లూనావత్ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.
,
చిల్పూర్ :జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫత్తేపూర్ శివారు లూనావత్ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దంపతుల రెండో కుమారుడు గుగులోత్ అభిరామ్ (6)ను తల్లిదండ్రులు ఇంటి వద్ద వదిలి పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమారుడు ఇంటి వద్ద లేకపోవడంతో గ్రామంలో వెతుకుతుండగా.. శివారులోని పొలంలో మృతి చెంది కనిపించాడు. గ్రామంలో గుంపులుగా ఉన్న వీధి కుక్కలు.. ఆడుకుంటున్న బాలుడిని తీవ్రంగా కరిచి, పొలంలోకి లాక్కెళ్లి ఉంటాయని ఆనవాళ్లను బట్టి అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీనిపై పోలీసు కేసు నమోదు కాలేదు.
Also read
- రెండు రోజుల్లో కుమార్తె వివాహం…
- అత్యాశకు పోయి.. అధిక వడ్డీ వలకు చిక్కి..
- వ్యాపారిని చంపిన కానిస్టేబుల్ దంపతులు
- కోనసీమలో పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ – 39 మందికి అస్వస్థత
- రేణుకను పక్కా ప్లాన్తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం




