వాడొక చిల్లరదొంగ.. చేసేవన్నీ కూడా చిల్లర దొంగతనాలు.. అట్లాంటి.. ఇట్లాంటివి కాదు.. ఇటీవల మనోడు చేసిన ఓ దొంగతనం విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక అవి చూసిన పోలీసులు దెబ్బకు ముక్కున వేలేసుకున్నారు. కక్కుర్తి ఉండాలి కానీ.. మరీ ఈ రేంజులోనా అంటూ నోరెళ్లబెట్టారు. కట్ చేస్తే.. ఆ చిల్లరదొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఖాకీలు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..
వివరాల్లోకెళ్తే.. పల్నాడు జిల్లాలోని గురజాల పట్టణం దాచేపల్లి మునిసిపాలిటీలో ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగతనం జరిగింది. స్థానిక బేకరీలోకి ఓ దొంగ అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా దూరాడు. షాపులో నుంచి రూ. 2 లక్షలు చోరీ చేశాడు. ఇక దొంగతనం చేసే సమయంలో మనోడి యవ్వారం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అదేంటంటే.. షాపులోకి దూరిన దొంగ.. మొదటిగా కౌంటర్ దగ్గర ఉన్న డ్రాయర్ నుంచి రూ. 2 లక్షలు తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. అప్పుడే మనోడిలోని చిల్లర దొంగ బయటకు వచ్చాడు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024