వేములవాడలో జ్యోతిషం చెప్పే ఓ పూజారి అధిక వడ్డీల పేరుతో రెండు కోట్లు వసూలు చేసి ఊడాయించాడు. తన దగ్గరికి వచ్చే అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టించి నమ్మించి మోసం చేసాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జ్యోతిషం చెప్పే మహేష్ రెండు కోట్ల రూపాయలతో పరారయ్యారు. గత కొంతకాలం వేములవాడలోని అంభాబాయ్ అలయంలో పూజారిగా పనిచేసేవాడు. అలయంలో పూజలతో పాటుగా, జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకి దగ్గర అయ్యాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చని నమ్మకం కలిగించాడు. మహేష్ వద్దకి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో వారికి అధిక వడ్డీ ఆశ చూపించాడు.
తాను చెప్పినట్లు డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని కొంత మందికి అధిక వడ్డీ ఇస్తూ నమ్మిస్తు వచ్చాడు. అధిక వడ్డీ ఇస్తూ ఉండడంతో చాలా మంది మహేష్ను నమ్మి డబ్బులు అప్పజెప్పారు. డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి మళ్ళీ డిపాజిట్ల ఆశ చూపడంతో నగరంలోని చాలమంది రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసారు. రెండు కోట్లు వసూలు అయ్యాక వాటిని సర్దుకొని మహేష్ ఉడాయించాడు. కొద్ది రోజులుగా జోతిష్యాలయం మూసి ఉండడంతో పాటుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వేములవాడలోని వ్యాపారులు, భక్తులు మహేష్ పూజారి వద్ద పెట్టుబడులు పెట్టిన వారు పోలీసులని కలిసి తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024