బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ మంగళవారం ప్రకటించారు. ‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె సోమవారం ఓ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ వివరణ ఇచ్చారు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ వెల్లడి
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే: బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ మంగళవారం ప్రకటించారు.
‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె సోమవారం ఓ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ వివరణ ఇచ్చారు. ‘రేవ్ పార్టీతో నాకేమీ సంబంధం లేదు. కావాలని నా పేరు ప్రచారం చేస్తున్నారు’ అని ఆమె తప్పుడు ప్రచారానికి దిగారని దయానంద్ వివరించారు. ఆమె ఆ కార్యక్రమానికి హాజరైనట్లు మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆధారాలు విడుదల చేశారు. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబీకులు హాజరైనట్లు గుర్తించామని చెప్పారు.
వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారో.. లేదో పరీక్షించడానికి రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న 101 మందిలో ఐదుగురు మినహా మిగిలిన వారందరినీ పోలీసుఠాణా జామీనుపై విడుదల చేశామని, పిలిస్తే విచారణకు హాజరు కావాలని సూచించామని చెప్పారు. పార్టీలో మత్తు పదార్థాలు వాడారనే సమాచారంపై ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటివి ఇకపై జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రేవ్ పార్టీ నిర్వహించిన చోట భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారు. వాటి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఐదుగురు నిందితుల అరెస్టు
రేప్పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేప్పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024