శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు
మంత్రి అప్పలరాజు ప్రోద్బలంతో ఘాతుకం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పలాస మండలం అమలకుడియా గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త బూర్జి అప్పలస్వామి పోలింగ్కు ముందు రోజు కాలనీ నుంచి వస్తుండగా.. వైకాపాకు చెందిన టి.వినోద్ ఎదురుపడి ఫ్యాన్ చాలా వేగంగా తిరుగుతోందని వ్యాఖ్యానించాడు. అప్పలస్వామి ప్రతిస్పందిస్తూ రోడ్డుపై సైకిల్ చాలా స్పీడుగా వెళ్తాందన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వినోద్ ‘నీ స్పీడు సంగతి తర్వాత చూస్తాం’ అంటూ వెళ్లిపోయాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక అప్పలస్వామి బహిర్భూమికి వెళ్తుండగా ఆయన తలపై క్రికెట్ స్టంప్తో దాడి చేశారు.
బాధితుడిని కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు 23 కుట్లు వేశారు.
Also read
- అబ్బ ఏం స్కెచ్ వేశావ్రా.. సైలెంట్గా జారుకుందాం అనుకున్నాడు.. కట్చేస్తే..
- ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్కు తీసుకెళ్లగా..
- పోలీసులు, న్యాయవాదులను ఉరుకులు పరుగులు పెట్టిన మెయిల్.. అసలేం జరిగిందంటే..?
- రాత్రివేళ స్కూటీపై ఒంటరిగా బయలు దేరిన మహిళ.. అకస్మాత్తుగా ఫోన్ బంద్.. ఆ తర్వాత..
- ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే టెన్త్ పరీక్ష రాసిన బాలిక





