“నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది.
“నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. నన్ను రక్షించండి మహాప్రభో!” అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తల గొడవ అనుకొని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వీడియో ఆధారాలతో సహా బాధితుడు మళ్లీ పోలీస్ స్టేషనుకు వచ్చాడు. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి వీడియో తీశాడు. ఆ వీడియోలో భర్తను ఆమె హింసిస్తున్న తీరు చూశాక.. పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నౌర్ జిల్లాకు చెందిన మనన్ జైదీ, మెహర్ జహాన్ భార్యాభర్తలు. మెహర్ భర్తను నిత్యం హింసించడం అలవాటుగా చేసుకొంది. మెహర్పై కేసు నమోదు చేశామని బిజ్నౌర్ జిల్లా ఏఎస్పీ మీడియాకు తెలిపారు.
Also read
- నేటి జాతకములు.29 ఏప్రిల్, 2026
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.





