పత్తిపాడు (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ … గుంటూరు జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు సిఐ మాధవి భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. మంగళవారం డిఎస్పి ఎం.వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ … గుంటూరుకు చెందిన రామోహన్ తెలంగాణ నల్గండ నుంచి 133 అక్రమ మద్యం సీసాల బాక్సులను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. మద్యం బాక్సుల నుంచి 6376 సీసాలు స్వాధీన పరుచుకున్నట్లు డిఎస్పి తెలిపారు. ఈ మద్యం సీసాల విలువ తెలంగాణలో ఒక్కొక్కటి రూ.130 కు అమ్ముతున్నారని చెప్పారు. పట్టుకున్న మొత్తం మద్యం సీసాల విలువ సుమారు 8,03376 రూపాయలు ఉంటుందని డిఎస్పి వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న సిఐ మాధవిని ఉన్నత అధికారులు అభినందించారు.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





