కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గo: ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్లిన నన్ను నా పేరు చెప్పగానే ఆర్డీవో తక్షణమే నన్ను బయటకు పంపించి వేసి నాపై క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసులకు చెప్పారని కొడాలి వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు మీడియా ముందు వాపోయాడు.
వివరాల్లోకి వెళితే గుడ్లవల్లేరు మండలం కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు గుడివాడ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి తన పేరు కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పగానే ఆర్డీవో తనను బయటకు పంపించి వేశారని, పోలీసులను పిలిపించి ఇతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారని వెంకటేశ్వర రావు తెలిపారు .
తాను దళిత కులానికి చెందిన వాడినని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో తాను ఎన్నికలలో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని, తనను రిటర్నింగ్ అధికారి బయటకు పంపించి వేయడంతో అక్కడే మరో అభ్యర్థి కోసం వచ్చిన కొంత మంది లాయర్లు ఆర్డీవోతో వాగ్వాదానికి దిగడంతో మరల తనని లోపలికి పిలిపించారని వెంకటేశ్వర తెలిపారు.
దళితుడైనందువలన ఆర్డీవో తనను ఆవామాన పరిచారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనన్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024