ఇంటి దగ్గర ఆడుకుంటూ ఓ చిన్నారి రెండు ఇళ్ళ మధ్య సందులో ఇరుక్కుంది. కనీసం అర అడుగు వెడల్పు కూడా లేని ఆ సందులో చిన్నారి దూరిపోయింది. నరకయాతన అనుభవించిన చిన్నారిని అతి కష్టం మీద సహాయక సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది
అనంతపురం జిల్లా ఆవుల తిప్పయ్యపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి అవంతిక ఆడుకుంటూ రెండు ఇళ్ల మధ్య వాస్తు కోసం వదిలేసిన సందులోకి వెళ్లి ఇరుక్కుంది. ఎంతసేపటికి సందులో నుంచి బయటికి రాకపోవడంతో కేకలు వేసిన చిన్నారి అరుపులను విన్న తల్లిదండ్రులు వచ్చి చూశారు. రెండు ఇళ్ళ మధ్య వాస్తు కోసం వదిలేసిన సందులో ఇరుక్కుని కనిపించింది. దీంతో చేసేదేం లేక చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. సందులోకి అయితే వెళ్ళింది. కానీ తిరిగి రావడం తెలియక.. మరో వ్యక్తి వెళ్లి తీసుకురావడం కుదరక దాదాపు రెండు, మూడు గంటల పాటు చిన్నారి నరకయాతన అనుభవించింది. ఆ రెండు ఇళ్ళ మధ్య సందులో ఇరుక్కునే ఉంది. చివరికి పోలీసులు ఓవైపు ఇంటి గోడను పగలగొట్టి చిన్నారిని రక్షించారు. చిన్నారి అవంతిక సురక్షితంగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు, ఫైర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బార్దర్ అభినందనలు తెలిపారు
Also read
- ‘గోవిందా’ అంటే అర్థం తెలుసా..? ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తప్పక తెలుసుకోండి
- నేటి జాతకములు..25 ఫిబ్రవరి, 2026
- కృష్ణానదీ తీరాన నాగేశ్వరుడుగా వెలసిన శివుడు- పెదకళ్లేపల్లి క్షేత్రాన్ని దర్శిస్తే దోషాలన్నీ పరార్!
- అనారోగ్య కారణాలతో బాబా దగ్గరకు వెళ్లారు.. కట్ చేస్తే, క్షుద్రపూజలు, రూ.100 కోట్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఏంట్రా ఇది!
- గర్ల్స్ హాస్టల్ దగ్గరలో ఏవో నల్లటి ఆకారాలు.. ఏంటా అని వెళ్లి చూడగా




